వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ః ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా ఈ నెల 8 న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. కాంగ్రెస్, వామపక్షా పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రబంద్ జరుగుతుంది. 20 రోజులుగా ఆర్టీసీ సమ్మెను పరిష్కరించకపోగా ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరిగారు. రాష్ట్రబంద్ కు కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ప్రతిపక్షాలు హెచ్చరించాయి.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉదృతం చేశారు. అన్ని జిల్లా కేంద్రాలలో ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే సంఘటిత కార్మిక శక్తి ఏంటో చూపుతామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు.
Story first published: Monday, November 5, 2001, 23:53 [IST]