వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ః తుపాను తీవ్రతకు అతలాకుతలంగా మారిన కడప, నెల్లూరు జిల్లాలను కేంద్ర బృందానికి చెందిన సభ్యులు సోమవారం పరిశీలించారు. కడప జిల్లా రాయచోటి తదితర ప్రాంతాల్లో ఓ బృందం పర్యటించగా మరో బృందం నెల్లూరు జిల్లా కొవ్వూరు, వెంకటగిరి, గూడారు తదితర ప్రాంతాలలో పర్యటించింది. తుపాను తమ నోటి దగ్గర అన్నం తీసేసిందని రైతులు కేంద్ర బృందానికి కన్నీళ్ళతో నివేదించారు.

By Staff
|
Google Oneindia TeluguNews

తుపాను కారణంగా ఈ రెండు జిల్లాల్లోని జల వనరులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం లోని సభ్యుడు ఒకరు అభిప్రాయ పడ్డారు. పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతామని కేంద్ర బృందం సభ్యులు చెప్పారు. ఆ తరువాత కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని వారు తెలిపారు. సాయంపై మాత్రం కేంద్ర బృందంపెద ప్పలేదు. నెల్లూరు చేరుకున్న కేంద్ర బృందం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సందర్శించారు. ఆ తరువాతపెన్న, పొర్లుకట్ట, 5వ నెంబర్‌ జాతీయ రహదారులకు పడ్డ గట్లను పరిశీలించింది. గూడురు మండలంలోని పలు పల్లెల్లో బృందం పర్యటించింది. మంత్రి ఆదాల ప్రభాకర్‌, జిల్లా కలెక్టర్‌ కేంద్ర బృందానికి తుపాను వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X