వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ః తుపాను తీవ్రతకు అతలాకుతలంగా మారిన కడప, నెల్లూరు జిల్లాలను కేంద్ర బృందానికి చెందిన సభ్యులు సోమవారం పరిశీలించారు. కడప జిల్లా రాయచోటి తదితర ప్రాంతాల్లో ఓ బృందం పర్యటించగా మరో బృందం నెల్లూరు జిల్లా కొవ్వూరు, వెంకటగిరి, గూడారు తదితర ప్రాంతాలలో పర్యటించింది. తుపాను తమ నోటి దగ్గర అన్నం తీసేసిందని రైతులు కేంద్ర బృందానికి కన్నీళ్ళతో నివేదించారు.
తుపాను కారణంగా ఈ రెండు జిల్లాల్లోని జల వనరులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం లోని సభ్యుడు ఒకరు అభిప్రాయ పడ్డారు. పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతామని కేంద్ర బృందం సభ్యులు చెప్పారు. ఆ తరువాత కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని వారు తెలిపారు. సాయంపై మాత్రం కేంద్ర బృందంపెద ప్పలేదు. నెల్లూరు చేరుకున్న కేంద్ర బృందం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సందర్శించారు. ఆ తరువాతపెన్న, పొర్లుకట్ట, 5వ నెంబర్ జాతీయ రహదారులకు పడ్డ గట్లను పరిశీలించింది. గూడురు మండలంలోని పలు పల్లెల్లో బృందం పర్యటించింది. మంత్రి ఆదాల ప్రభాకర్, జిల్లా కలెక్టర్ కేంద్ర బృందానికి తుపాను వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలించారు.
Comments
Story first published: Monday, November 5, 2001, 23:53 [IST]