వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీః ప్రభుత్వం, పోలీసులు అనేక ధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆదివారం నాడు అఖిల భారత ఎస్‌సి, ఎస్‌టి సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సుమారు పదివేల మంది దళితులు బౌద్ధమతంలోకి మారారు.

By Staff
|
Google Oneindia TeluguNews

అంబేద్కర్‌ భవన్‌లో ఈ మూకుమ్మడి మతాంతీకరణ కార్యక్రమం జరిగింది. తొలుత ఈ కార్యక్రమాన్ని రామ్‌లీలా మైదానంలో నిర్వహించాలని తలపెట్టారు. అయితే ముందుగా ఇచ్చిన అనుమతిని పోలీసులు రద్దు చేయడంతో చివరకు కార్యక్రమాన్నిఅంబేద్కర్‌భవన్‌కు మార్చాల్సివచ్చిందని సమాఖ్య కన్వీనర్‌ రామ్‌రాజ్‌ చెప్పారు.

ఇండియన్‌ రెవెన్యూసర్వీస్‌లో అధికారిగా వున్న రామ్‌రాజ్‌ మతమార్పిడితో తనపేరును ఉదిత్‌ రాజ్‌గా మార్చుకున్నారు. అయితే కార్యక్రమం సాంతం తీవ్రగందరగోళం మధ్య సాగిందని రామ్‌రాజ్‌ ఆయన అనుచరులు కొద్ది మంది మాత్రమే బౌద్ధ భిక్షువు బుద్ధ ప్రియ రాహుల్‌ సారథ్యంలో సంప్రదాయం ప్రకారంశిరోముండనం చేసుకుని బౌద్ధం స్వీకరించారని ప్రత్యక్ష్య సాక్షులు చెప్పారు.

ఆదివారం నాడు కనీసం పదిలక్షల మంది మతం మార్చుకోనున్నట్టుగా సమాఖ్య తొలుత ప్రకటించినప్పటికీఅంబేద్కర్‌ భవన్‌కు హాజరైన వారి సంఖ్య మూడువేల ుంచలేదని వారుచెప్పారు. ఈ మూడు వేలమందిలో కూడా కొందరికి మాత్రమే బౌద్ధ సన్యాసులు సంప్రదాయ బద్ధంగా మతంమార్చారని ుగిలిన వారంతా మౌఖిక ప్రతిజ్ఞద్వారా మతం మార్చుకుంటున్నట్టుగా ప్రకటించారని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X