వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముషారఫ్‌ ప్రతిపాదనకు భారత్‌ నో

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః భారత్‌ పాకిస్తాన్‌ ల మధ్యవిమాన సర్వీసుల నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా పాకిస్తాన్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ చేసిన ప్రతిపాదనను భారత్‌ తిరస్కరించింది. అటుంవంటి నిర్ణయాలను అంత తేలిగ్గా తీసుకోలేం అని భారత్‌ గురువారం స్పష్టం చేసింది. సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి చెప్పేందుకు పాక్‌ ఎటువంటి చర్యలు తీసుకోలేదని అటువంటప్పడు నిషేధాన్ని ఎలా ఎత్తివేస్తామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు.

భారత్‌ వేరే సమస్యలతో సతమతం అవుతున్న దరిమిలావిమానసర్వీసులపై నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా సార్క్‌ సదస్సులో ముషారఫ్‌ ప్రతిపాదించారు. సార్క్‌ దేశాల సమాచార మంత్రుల సమావేశంలో భారత సమాచార మంత్రి సుష్మాస్వరాజ్‌ పాల్గొన్నారు. ఆమె సమక్షంలో ముషారఫ్‌ ఈ ప్రతిపాదన చేశారు. అయితే సుష్మాస్వరాజ్‌ తెలివిగా మాట్లాడారు. ఓ మంత్రికి ఆ అధికారం వుందనిమీరు భావిస్తే ఇక్కడికి ఇక్కడే విమాన సర్వీసులపై నిషేధం ఎత్తేస్తాను అని వ్యాఖ్యానించారు. ఈ సమవేశంలో ప్రసంగించిన ముషారఫ్‌ ప్రసంగం ముగిసిన వెంటనే వేదికపై వున్న సుష్మాస్వరాజ్‌ తో కరచాలనం చేసి అక్కడ నుంచి వెల్లిపోవడంవిశేషం.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X