వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధ ప్రాతిపదికన ఎన్నికల బిల్లు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా నేరెళ్ల గ్రామం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగాపీపుల్స్‌వార్‌ రాష్ట్ర కమిటీ రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చింది.పీపుల్స్‌వార్‌ ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యురాలు పద్మక్కతో పాటు మరో ముగ్గురు నక్సలైట్లను ఈ నెల 2వ తేదీన పోలీసులు కాల్చి చంపారనిపీపుల్స్‌వార్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ, ఉత్తర తెలంగాణస్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శులు జంపన్న, బాలకృష్ణ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు.

పద్మక్క దళంతో ఉన్న సమాచారాన్ని ఇన్‌ఫార్మర్‌ ద్వారా తెలుసుకున్న పోలీసులు నేరెళ్ల సమీపంలో వారిని చుట్టుముట్టి కాల్చి చంపారని వారన్నారు. ఈ సంఘటన ప్రభుత్వ నీచమైన ఎత్తుగడకు నిదర్శనమని వారన్నారు. చర్చలకు విఘాతం కలిగించడానికే చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఈ ఎన్‌కౌంటర్‌కు పాల్పడిందని వారు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఫాసిస్టు నిర్బంధ కాండకు నిరసనగా ఈ నెల 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర బంద్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్‌లోస్వచ్ఛందంగా పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X