వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఘాట్ రోడ్డులో 12 క్లెమోర్ మైన్స్
హైదరాబాద్ః తిరుమల ఘాట్ రోడ్డులో మరో12 క్లెమోర్ మైన్స్ ను గురువారం పోలీసులు కనుగొన్నారు. యాంటీ బాంబు స్క్వాడ్ వెలికితీస్తున్న మందుపాతరలు భీతావహంగా ఉన్నాయి. ఒకచోటమిస్ అయినా మరోచోట పేల్చేందుకు ఘాట్ రోడ్ లో అనేక చోట్ల మందుపాతరలను నక్సలైట్లు అమర్చినట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రిపై దాడి సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకితీసుకున్నారు. కాగా ఈ దాడులతో ఏ మాత్రం సంబంధం లేని నలుగురు పౌరహక్కులనాయకులను పోలీసులు అరెస్టు చేసి చిత్ర హింసలు పెడుతున్నారని రాష్ట్ర పౌరహక్కుల సంఘంవిమర్శించింది.
Comments
Story first published: Thursday, October 2, 2003, 23:53 [IST]