వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తీర్పుపై మాదిగలఆగ్రహం, మాలల హర్షం
హైదరాబాద్:షెడ్యూలు కులాలను విభజించరాదంటూ సుప్రీంకోర్టుఇచ్చిన తీర్పుపై మాదిగ నాయకులు ఆగ్రహంవ్యక్తం చేస్తుండగా మాల మహానాడుహర్షం వ్యక్తం చేసింది. గత తెలుగుదేశంప్రభుత్వం రాజకీయ స్వార్ధం కోసం ఎస్సిలవర్గీకరణ చట్టం తెచ్చిందని మాలమహానాడురాష్ట్ర అధ్యక్షుడు వైవి రావు శనివారంహైదరాబాద్లో వ్యాఖ్యానించారు.
కులాలవర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్నసుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని ఆయనమాదిగ పోరాట సమితిని కోరారు. ఇలా ఉండగాసుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగారాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయాలని మాదిగనాయకులు సన్నాహాలు చేస్తున్నారు.
Story first published: Saturday, November 6, 2004, 23:53 [IST]