భూములుపంచితే కఠిన చర్యలు: జానా
వరంగల్:భూముల ఆక్రమణకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హోం మంత్రి కె.జానారెడ్డి హెచ్చరించారు. వరంగల్లోఆయన ఆదివారం ముప్పై ఎనిమిదవపోలీసుల క్రీడా పోటీలను ఆయనప్రారంభించారు.
భూములనుపంపిణీ చేస్తామంటూ నక్సల్స్ ప్రజలనురెచ్చగొట్టవద్దని ఆయన నక్సల్స్కుసూచించారు. భూ పంపిణీపై నక్సల్స్జోక్యాన్ని సహించబోమని ఆయన అన్నారు.గత ముప్పై ఐదు యేళ్లుగానక్సల్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారనిఆయన విమర్శించారు. నక్సల్స్తోచర్చపై అనుమానాలు అక్కరలేదని,సమస్యలు పరిష్కారమయ్యే వరకునక్సల్స్తో చర్చలు జరుపుతామనిఆయన చెప్పారు.
తాముశాంతి సాధనకు కట్టుబడి ఉన్నామనిఆయన చెప్పారు. నక్సల్స్ సభలకుఅనుమతించే విషయంపై ఇక నుంచిమంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందనిఆయన చెప్పారు. ఆలస్యమైనా అన్ని విప్లవగ్రూపులతో చర్చలు జరుపుతామని ఆయనచెప్పారు. నక్సల్స్తో రెండవవిడత చర్చలు ఎప్పుడు జరుగుతాయనేవిషయానికి ఆయన నేరుగాసమాధానం ఇవ్వలేదు.