వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనశక్తికరీంనగర్‌ సభకు పోలీసుల దెబ్బ

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌:కరీంనగర్‌లో సిపిఐ (యంయల్‌)జనశక్తి బహిరంగ సభకు ఆదివారంపోలీసుల నుంచి అడుగడుగునా ఆటంకాలుఎదురయ్యాయి. కరీంనగర్‌ పట్టణాన్నిపోలీసులు చుట్టుముట్టారు. సభకువస్తున్న వాహనాలను విస్తృతంగాతనిఖీ చేశారు.

బహిరంగసభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.కోర్టు అనుమతి ఇచ్చిందని సిపిఐ(యంయల్‌) జనశక్తి నాయకుడుమంగన్న ప్రకటించారు. అయితే కోర్టుఆదేశాల ప్రతి తమకు అందలేదనిపోలీసులు బహిరంగ సభకు అనుమతినిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూసభను నిర్వహిస్తామని జనశక్తినాయకులు చెప్పారు. అయితే అనుమతిరాకపోవడంతో సభను ఒక హాల్‌లోసమావేశంగా నిర్వహిస్తామనిజనశక్తి నాయకులు చెప్పారు. ఆ హాల్‌నుంచి కూడా పోలీసులు అందరినీపంపించేశారు. దీంతో నక్సల్స్‌సానుభూతిపరులు వెనక్కివెళ్లిపోయారు. ఈ కారణంగాకరీంనగర్‌ పట్టణంలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. సిపిఐ(యంయల్‌) జనశక్తి బహిరంగసభను రద్దు చేసుకుంది. పోలీసులువిఘాతం కలిగించడం వల్లనే సభనురద్దు చేసుకున్నట్లు జనశక్తి ప్రతినిధిచంద్రన్న చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X