విశాఖ పోర్టులో ఉబికిన నేల
విశాఖపట్నం: విశాఖపట్నం ఓడరేవులో శుక్రవారం మధ్యాహ్నం ప్రకృతి వైపరీత్యం సంభవించింది. పోర్టులోని కోల్ యార్డులో భూమి పైకి ఉబికి వచ్చింది. భూమి 8 అడుగుల మేర పైకి ఉబికి వచ్చింది. పోర్టు రైల్వే లైను 17 కిలోమీటర్ల మేర పైకి లేచింది. దీంతో పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు.
మాంగనీసు నిల్వలు స్థాయికి మించి ఎక్కువగా ఉండటం వల్లనే ఈ వైపరీత్యం సంభవించినట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రమే అక్కడ భూమి నెర్రెలు పారడం గమనించినట్లు వాచ్ మన్ చెబుతున్నాడు. ఈ ప్రమాదంతో మాంగనీసు నిల్వలను తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. క్రేన్ లను, లారీలను తెప్పించారు.












Click it and Unblock the Notifications