లోక్ సభలోనే రాజీనామాలు: కెసీఅర్ యోచన
న్యూఢిల్లీ: రాజకీయ చతురతకు మారు పేరైన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు లోక్ సభలోనే మరో వ్యూహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పార్లమెంట్ లో ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే నిరసన వ్యక్తం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
లోక సభలో ఓక చర్చలో పాల్గొనబోవడం ఇదే ప్రధమం. ఇదే చివరిది. ఎందుకంటే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు ప్రధాని స్పందించిన వెంటనే కెసీఅర్ నాయకత్వంలోని తెలంగాణ ఎంపీలంతా నిరసన వ్యక్తం చేస్తూ సభలోనే స్పీకర్ సోమనాథ్ చటర్జీకి రాజీనామాలు సమర్పించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications