ముగ్గురు జనశక్తి నక్సల్స్ హతం
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో సోమవారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జనశక్తి నక్సలైట్లు మరణించారు. తునికాకు కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసుకునేందుకు నక్సలైట్లు వస్తున్నారని సమాచారం అందడంతో టేకులపల్లి అటవీ ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
మృతి చెందిన నక్సలైట్లను జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యుడు దయా, నాగార్జున, కిషన్ లుగా గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు 8 ఎంఎం పిస్టళ్లను, ఒక టోల్ బోర్ గన్నును, కార్బయిడ్ ను, 30 తపంచాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications