తిరుమల కాటేజీలో మహిళ హత్య
తిరుమల: తిరుమల కాటేజీలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని జిఎన్ సి 512 కాటేజీలో మహిళ దారుణ హత్యకు గురైంది. కాళ్లు, చేతులూ కట్టేసి ఆ మహిళను హత్య చేశారు. శవాన్ని స్నానాల గదిలో పడేశారు. హత్యకు గురైన మహిళ ఎవరైందీ తెలియడం లేదు.
ఈ నెల 1వ తేదీన చెన్నైకి చెందిన ఒక కుటుంబం ఈ కాటేజీలో దిగింది. భార్యాభర్తలు వారి ఇద్దరి పిల్లలతో ఆ కాటేజీలో దిగారు. అయితే ఇప్పటి వరకు ఆ కుటుంబం ఖాళీ చేసినట్లు రికార్డు కాలేదు. ఆ కాటేజీనుంచి దుర్వాసన వస్తుండడంతో టిటిడి సిబ్బంది పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చి కాటేజీ తలుపులు తెరిచి చూస్తే మహిళ హత్యకు గురైన విషయం బయటపడింది.












Click it and Unblock the Notifications