అజిత్ సింగ్ తో బర్దన్ భేటీ

Ajit Singh
న్యూఢిల్లీ: ఈ నెల 22వ తేదీన జరిగే బలపరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలను కూడగట్టే ప్రయత్నంలో భాగంగా వామపక్షాలు రాష్ట్రీయ లోకదళ్ (ఆర్ఎల్డీ) మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్దన్ గురువారంనాడు ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్ ను కలిశారు. అయితే అజిత్ సింగ్ ఆయనకు ఏ విధమైన హామీ ఇవ్వలేదు.

వారిద్దరి మధ్య దాదాపు గంట సేపు చర్చలు జరిగాయి. అణు ఒప్పందంపై వామపక్షాల వైఖరిని బర్దన్ అజిత్ సింగ్ కు వివరించారు. తాను వామపక్షాల వైఖరిని, పరిస్థితిని వివరించానని, అజిత్ సింగ్ తన వైఖరి చెప్పారని, నిర్ణయం తీసుకోవడం ఆర్ఎల్డీకి అంత సులభం కాదని బర్దన్ విలేకరులతో అన్నారు. అనుభవజ్ఞుడు, పాత మిత్రుడు అయిన బర్దన్ తాజా రాజకీయాల గురించి వివరించారని, తాను ఈ విషయాలపై తన పార్టీ సహచరులతో మాట్లాడుతానని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. అజిత్ సింగ్ తన నిర్ణయం తాను తీసుకుంటారని బర్దన్ అన్నారు. బర్దన్ కొన్ని కొత్త విషయాలు చెప్పారని, ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంలో తప్పేమీ లేదని అజిత్ సింగ్ అన్నారు.

తాను మాయావతితో మాట్లాడలేదని, అణుశక్తికి తాను వ్యతిరేకమని, అయితే అణు ఒప్పందానికి తాను వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. ఆలస్యంగానైనా సరే సరైన నిర్ణయం తీసుకోవడం అవసరమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+