కాంగ్రెస్ ఎంపిల ఇళ్ల ముందు ధర్నాలు

నిజామాబాద్ లోని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ ఇంటి ముందు తెరాస కార్యకర్తలు ధర్నాకు దిగారు. అక్కడే వంటావార్పూ చేసుకున్నారు. నిర్మల్ లోని ఇంద్రకరణ్ ఇంటి ముందు కూడా తెరాస నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. తన ఇంటి ముందు ధర్నాకు దిగిన తెరాస కార్యకర్తలతో సర్వే సత్యనారాయణ మాట్లాడారు. కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు. అయితే తెరాస కార్యకర్తలు ఆయనతో వాదనకు దిగారు. ప్రధాని చేత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స్పష్టమైన ప్రకటన చేయించాలని వారు డిమాండ్ చేశారు. అలా చేస్తే తమ పార్టీ ఎంపీలు యుపిఎకు ఓటు వేస్తారని వారు చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలు రేణుకాచౌదరి, జి. వెంకటస్వామి ఇళ్ల ముందు కూడా తెరాస కార్యకర్తలు ధర్నాలు చేశారు.












Click it and Unblock the Notifications