నన్ను ఎగతాళి చేశారు: బాబు

తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చామని ఆయన చెప్పారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాల ద్వారా పాలనలో పారదర్శకతను పెంచామని, అధికారులను, అనధికారులను ప్రజలు ప్రశ్నించే వాతావరణం కల్పించామని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచినట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల స్థాపనకు కృషి చేశామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications