ముషార్రఫ్ రాజీనామా ప్రకటన

దేశం కోసం తాను రెండు యుద్ధాలు చేశానని, దేశంపై ఉన్న ఉగ్రవాద ముద్రను తొలగించడానికి ప్రయత్నించానని ఆయన అన్నారు. దేశసేవ కోసం ఇప్పటికీ ఉత్సాహంగా ఉన్నానని ఆయన చెప్పారు. అభిశంసనను ఎదుర్కోవడం తన హక్కు అని ఆయన అన్నాను. ప్రభుత్వ చార్జిషీట్ తప్పుల తడక అని, చార్జిషీట్ ను ఎదుర్కుంటానని ఆయన చెప్పారు. తనకు అన్నిటి కన్నా ముఖ్యం పాకిస్తాన్ అని ఆయన అన్నారు. తానూ మామూలు మనిషినే అని, సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని తప్పులు చేసి ఉంటానని ఆయన అన్నారు. పాక్ ను ప్రపంచంలో తలెత్తుకునేలా చేశానని ఆయన అన్నారు. తన పాలనలో దేశం సుభిక్షంగా ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications