బీహార్ లో ఇద్దరిని కాల్చి చంపిన మావోయిస్టులు
పాట్నా: బీహార్ లోని వైశాలి జిల్లాలోని ఒక గ్రామంలో మావోయిస్టులు ఇద్దరు గ్రామస్ధులను కాల్చి చంపారు. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం ఉదయం వెల్లడించారు. పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలో గోస్వార్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. మృతులు బీహార్ లో అధికారిక భాగస్వామ్యం గల భారతీయ జనతాపార్టీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో మృతుల బంధువులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టులను పట్టుకోడానికి గాలింపు జరుగుతోందని జిల్లా ఎస్పీ చెప్పారు.












Click it and Unblock the Notifications