ఒబామా ప్రయత్నించారు: ప్రధాని

ఒబామా ఈ నెల 8వ తేదీన తనతో మాట్లాడడానికి ప్రయత్నించారని, అయితే తగినంత సమయం లేకపోవడం వల్ల మాట్లాడడం కుదరలేదని ఆయన చెప్పారు. అప్పటి నుంచి తాను ప్రయాణంలో ఉన్నానని, తాను భారత్ కు తిరిగి వెళ్లిన వెంటనే మాట్లాడుతానని ఆయన చెప్పారు. పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో పాటు 15 మంది ప్రపంచ నేతలతో ఫోనులో మాట్లాడిన ఒబామా మన్మోహన్ సింగ్ తో మాత్రం మాట్లాడలేదని వార్తలు వచ్చాయి.
అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ముందే ఒబామా తనకు సాదరపూర్వకమైన లేఖ రాశారని మన్మోహన్ సింగ్ చెప్పారు. తాను కూడా ఒబామాకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. భారత, అమెరికా సంబంధాలు మరింత పటిష్టం కాగలవని ఆయన ఆశించారు. ప్రధాని ఓమన్, ఖాతర్ పర్యటనల్లో ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications