సత్యంకు కొత్త ఆడిటర్స్:దీపక్ పరేఖ్
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్కు కొత్త ఆడిటర్లుగా కేపీఎంజీ, డెల్లాయిట్లను నియమించినట్లు సంస్థ కొత్త డైరక్టర్లు తెలిపారు. సంస్థ ఆడిటింగ్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆడిటింగ్ సంస్థ ప్రైస్వాటర్హౌస్ కూపర్స్ను తప్పించి కేపీఎంజీ, డెల్లాయిట్లకు బాధ్యతలు అప్పగిస్తునట్లు డైరక్టర్ దీపక్ పరేఖ్ తెలిపారు.
మరోవైపు ప్రైస్వాటర్హౌస్ కూపర్స్ హైదరాబాద్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేశారని బుధవారం వార్తలు వెలువడ్డాయి. వీటిని సంస్థ అధికారులు కొట్టివేశారు. దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తామనీ, వారు అడిగిన అన్ని పత్రాలనూ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని పీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.
Comments
Story first published: Thursday, January 15, 2009, 12:51 [IST]