వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సత్యం' డబ్బుదోచుకుంది రాజే!

By Staff
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
న్యూయార్క్‌: కంపెనీ నిధుల్లో అయిదు వేల కోట్ల రూపాయలకు పైగా రామలింగరాజు దారి మళ్లించినట్లు న్యూయార్‌క టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. దీనితో కొన్నేళ్లుగా సత్యం కంప్యూటర్స్‌లో కృత్రిమ లాభాలను చూపించి, ఇన్వెస్టర్లను, ఉద్యోగులను మోసం చేసినట్లు కంపెనీ మాజీ చైర్మన్‌ రామలింగరాజు చేసిన ప్రకటన అబద్దమని తేలిపోయింది.

జనవరి 7న బోర్డుకు రామలింగరాజు ఒక లేఖ రాస్తూ, వంద కోట్ల డాలర్ల రిజర్వు నిధులు కల్పితమని ప్రకటించిన విషయం విదితమే. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న విచారణాధికారి ఒకరు నిధుల మళ్లింపు విషయాన్ని ధృవ పరిచారని, పేరు తెలపడానికి మాత్రం ఇష్టపడలేదని యుఎస్‌ డైలీ పేర్కొంది.

వంద కోట్ల డాలర్ల నిధులను (సుమారు అయిదు వేల కోట్ల రూపాయలు) రామలింగరాజు అత్యంత చాకచక్యంగా మళ్లించారని, ఇందుకోసం 300లకు పైగా కంపెనీలను సృష్టించినట్లు తెలిపింది. ఈ కంపెనీలన్నీ రాజు పేరు మీదనో లేదా అతని కుటుంబ సభ్యుల పేరు మీదనో రిజిస్టర్‌ అయ్యాయని, దీనితో సత్యం వ్యవహారం మరింత క్లిష్టంగా మారిందని న్యూయార్క్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X