హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊరపందుల్లా మెక్కుతున్నారు

By Staff
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: ఉపాధి హామీ, ఇందిరమ్మ చెరువులు, ఇందిరమ్మ ఇళ్లు... ఇలా ప్రతి పథకంపైనా పడి కాంగ్రెస్‌ నాయకులు ఊరపందుల్లా తింటున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత నాగం జనార్దనరెడ్డి ఆరోపించారు. నిన్న ఆయన మీడియాతో మట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దురాశ రెడ్డిగా మారిపోయారని, ఆయన కారణంగానే సత్యం వంటి కంపెనీ పతనమైందని విమర్శించారు.అలాగే రామలింగరాజుకు చెందిన మేటాస్‌కు కాంట్రాక్టులు ఇస్తామని ఆశ చూపి సత్యం సంస్థను మటాష్‌ చేశారని విమర్శించారు.

ముఖ్యమంత్రి అత్యాశ తెలిసి..నాలుగున్నరేళ్లలో హైదరాబాద్‌కు ఒక్క కంపెనీ కూడా రాలేదని విమర్శించారు. పనికి ఆహార పథకంపై సమాచారం అడిగితే అప్పట్లో మేం గాంధీభవన్‌కు పంపాం. ఇప్పుడు మేం సమాచారం అడిగితే సమాచార హక్కు కింద దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు'' అని నాగం వ్యాఖ్యానించారు. చివరగా చిరంజీవికి మించిన అయోమయవాది మరొకరు లేరని నాగం వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X