చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్‌ జగన్‌ పోస్టర్లపై..

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌: తిరుపతిలో ముఖ్యమంత్రి వైఎస్‌ కుమారుడు వైఎస్‌ జగన్‌ చిత్రాలతో గోడలపై రాసిన రాతలను, అంటించిన పోస్టర్లను వెంటనే తొలగించాలని సిఇఒ ఆదేశించారు. సాధారణ ఎన్నికల షెడ్యూలు విడుదలై 24 గంటలు కూడా గడవకముందే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన రాజకీయ పార్టీలపై కొరడా ఝలిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇఒ) మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన పిర్యాదులను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నారు.

దాంతో ఎన్నికల నిబంధనావళిని ఖచ్చితంగా అమలు జరిపి తీరాల్సిందేనని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. కరెంటు స్తంభాలు, మంచినీటిని సరఫరా చేసే పైపుల పైన కూడా జగన్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ రాసిన రాతలను రెండ్రో జుల్లోగా తొలగించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని సిఇఒ చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశించారు. ఎవరి పేర్లతో గోడలపై రాతలు, పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయో ఆ నాయకుల చేతనే వాటిని తొలిగింపజేయాలని డాక్టర్‌ ఐవి సూచించారు. లేనిపక్షంలో వెంటనే చట్టరీత్యా బాధ్యులైన వ్యక్తు లపై చర్య తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారి చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశించారు. ఎన్నికల నిబంధ నావళిని అమలుపరచడంలోజిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X