నేతలపై ఎన్నికల కోడ్ సుత్తి దెబ్బలు
హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసులు నమోదయ్యాయి. కొందరికి నోటీసులు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాద్ మీదనే కాకుండా, కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మీద కూడా నోటీసులు జారీ అయ్యాయి. కోడెలను అరెస్టు చేసి ఆ తర్వాత జామీను మీద విడుదల చేశారు.
రాష్ట్ర రవాణా మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఎన్నికలసంఘం నోటీసులు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రార్థనామందిరాలకు వెళ్లి మద్దతు కోరారని, కులాలు, మతాల ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా ఎన్నికల అధికారి జయేష్ రంజన్కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన రిటర్నింగ్ అధికారి జైన్ను వివరణ కోరారు. జైన్ మంత్రికి నోటీసులు జారీ చేశారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కేసులో మాజీమంత్రి కోడెల శివప్రసాదరావును పోలీసులు అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నర్సరావుపేటలో ర్యాలీని నిర్వహించినందుకు గాను ఈసీ ఆదేశాలమేరకు ఆయనపై కేసు నమోదైంది. ఈరోజు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన బెయిలుపై విడుదలయ్యారు. ఇదిలాఉండగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ తెరాస ఎమ్మెల్యే హరీష్రావుకు, గజ్వేల్ మార్కెట్కమిటీ ఛైర్మన్కు కూడా ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు - తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications