నేతలపై ఎన్నికల కోడ్ సుత్తి దెబ్బలు
హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసులు నమోదయ్యాయి. కొందరికి నోటీసులు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాద్ మీదనే కాకుండా, కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మీద కూడా నోటీసులు జారీ అయ్యాయి. కోడెలను అరెస్టు చేసి ఆ తర్వాత జామీను మీద విడుదల చేశారు.
రాష్ట్ర రవాణా మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఎన్నికలసంఘం నోటీసులు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రార్థనామందిరాలకు వెళ్లి మద్దతు కోరారని, కులాలు, మతాల ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా ఎన్నికల అధికారి జయేష్ రంజన్కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన రిటర్నింగ్ అధికారి జైన్ను వివరణ కోరారు. జైన్ మంత్రికి నోటీసులు జారీ చేశారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కేసులో మాజీమంత్రి కోడెల శివప్రసాదరావును పోలీసులు అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నర్సరావుపేటలో ర్యాలీని నిర్వహించినందుకు గాను ఈసీ ఆదేశాలమేరకు ఆయనపై కేసు నమోదైంది. ఈరోజు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన బెయిలుపై విడుదలయ్యారు. ఇదిలాఉండగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ తెరాస ఎమ్మెల్యే హరీష్రావుకు, గజ్వేల్ మార్కెట్కమిటీ ఛైర్మన్కు కూడా ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications