పాక్ లో దాడి: 11 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో గురువారంనాడు ఆత్మాహుతి దాడి జరిగింది. రెస్టారెంట్ పై జరిగిన ఈ దాడిలో 11 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. టంక్ జిల్లాలోని జందోలా బజారులో గల రెస్టారెంటుపై దాడి జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారికంగా వివరాలు వెల్లడించడానికి పాకిస్తాన్ అధికారులు నిరాకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆల్ ఖైదా, తాలిబాన్ సంస్థలు బలంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications