ఎన్టీఆర్ మళ్లీ వస్తాడు: బాబు

Chandrababu Naidu
కాకినాడ: జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ప్రజల వద్దకు వస్తాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎన్టీఆర్ కోలుకుంటున్నారని, మళ్లీ ప్రజల వద్దకు వస్తాడని ఆయన చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎన్నికల ప్రచార సభలో ఆయన బుధవారం మాట్లాడారు. కాంగ్రెసు పార్టీపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీపైనా ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని రాహుల్ గాంధీ చెప్పడంపై ఆయన విమర్శలు చేశారు. ప్రత్యేక ఆర్థిక మండలి వల్ల ప్రజలకు నష్టం వాటిల్లుతోందని, దాని వల్ల ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మనుషులకు పెద్ద యెత్తున డబ్బులు వచ్చాయని ఆయన అన్నారు.

నగదు బదిలీ పథకాన్ని తాము అమలు చేసి తీరుతామని ఆయన చెప్పారు. దాన్ని అమలు చేయలేరనే ముఖ్యమంత్రి వ్యాఖ్యను ఆయన ఖండించారు. ఎన్నికల్లో కాంగ్రెసు నాయకులు డబ్బులు వెదజల్లుతారని, ఎక్కడ కొట్టినా వారి నుంచి డబ్బులు రాలుతాయని, ఆ పాపిష్టి డబ్బుకు లొంగిపోవద్దని ఆయన అన్నారు. ఒక్క ఓటు కూడా అమూల్యమైనదేనని, దాన్ని కాంగ్రెసును ఓడించడానికి వాడాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు అవినీతి సొమ్ముతో కోట్ల రూపాయలకు పడగలెత్తారని ఆయన విమర్శించారు. తాము ఇచ్చిన హామీలను అన్నింటినీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+