చంద్రబాబు పిట్టల దొర: వైయస్

ఎన్నికల ప్రణాళిక రాజకీయ పార్టీలకు మతగ్రంథం లాంటిదని, దాన్నే చంద్రబాబు పట్టించుకోరని ఆయన అన్నారు. తాను ప్రస్తుతం ఇస్తున్న హామీల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారంటే స్విస్ బ్యాంక్ డబ్బులు తెస్తామని అంటున్నారని ఆయన అన్నారు. తన ఆస్తులు ఏడాది క్రితం వేయి కోట్ల రూపాయలు అన్న చంద్రబాబు ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలు అంటున్నారని, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. గతంలో ఎన్నికలకు ముందు రోష్నీ, ముందడుగు వంటి పథకాలను ప్రకటించి ఆ తర్వాత చంద్రబాబు వాటి ఊసే ఎత్తలేదని ఆయన అన్నారు.
తమపై ప్రజలకు విశ్వసనీయత ఉందని, ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామని ఆయన అన్నారు. తాము రెండో వాగ్దానాలను ప్రజలకు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం కింద ఇస్తున్న బియ్యం కోటాను కుటుంబానికి 30 కిలోలకు పెంచుతామని, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను రోజుకు 7 గంటల నుంచి 9 గంటలకు పెంచుతామని ఆయన చెప్పారు.ప్రస్తుతం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తాము తిరిగి అధికారంలో వస్తే మరింత సమర్థంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications