వైయస్ పై ఈసీకి కూటమి ఫిర్యాదు
హైదరాబాద్: మలి దశ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా చేస్తున్న ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రసంగాలను అడ్డుకోవాలంటూ మహాకూటమి నేతలు ఆదివారం ఎన్నికల ప్రధానాధికారి ఐవి సుబ్బారావును కోరారు. ఈమేరకు వారు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. పాతబస్తీలో డీజీపీ మహంతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీపై కూడా చర్య తీసుకోవాలని వారు ఈసీని కోరారు.
తెలంగాణపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై తీవ్ర దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనం హైదరాబాదుకు విదేశీయులం అవుతామని, పోతిరెడ్డిపాడుకు నీరు రాదని ఆయన నంద్యాల ఎన్నికల ప్రచార సభలో మాట్లాడి దుమారానికి తెర తీశారు. దమ్ముంటే పోలీసు డ్రెస్ తీసేసి పాతబస్తీకి రావాలని అసదుద్దీన్ ఓవైసీ డిజిపి మహంతిని సవాల్ చేశారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications