ఎన్డీయెలో చేరం: చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్‌: తమది లౌకిక పార్టీ అని, ఎన్డీయెలో చేరే అవకాశం ఎంత మాత్రం లేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తెలిపారు. కేంద్రంలో పరిణామాల్ని పరిశీలించాల్సి ఉందని చెప్పారు. మహాకూటమి మాయాకూటమని తాను ముందుగానే చెప్పానని, తెరాస ఎన్డీయెలోకి వెళ్లడంపై వామపక్షాలు, తెలుగుదేశం వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో అన్నారు. యూపీఏపై వామపక్షాలు ఆసక్తి చూపితే తెలుగుదేశం వైఖరి ఎలా ఉంటుందోనని సందేహం వెలిబుచ్చారు. తెరాస కూటమిని వదిలిపోవటం తెలుగుదేశం పార్టీకి కచ్చితంగా నష్టమేనని స్పష్టం చేశారు. కూటమిలోని పక్షాల మధ్య భావసారుప్యత లేదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఎవరితో కలిసే అవకాశముందని ప్రశ్నించగా తామే సొంతగా అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. సినీనిర్మాత అశ్వనీదత్‌ తనను కలిసినట్లు చెప్పారు. తెదేపాతో అవగాహన గురించి ఆయన వద్ద ప్రస్తావించగా ఫలితాలు వచ్చాక మాట్లాడదామని బదులిచ్చానని వివరించారు. కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారని ప్రశ్నించగా నాలుగో ఫ్రంట్‌ ఉంది కదా అని చెప్పారు. ప్రధాని అభ్యర్దిగా ఎవరికి మద్దతిస్తారని ప్రశ్నించగా ఫలితాలొచ్చాక మాట్లాడదామని, దీనికి ఇంకా సమయముందని జవాబిచ్చారు. మూడో కూటమి గురించి ప్రస్తావించగా అది అసలు ఉంటుందో, లేదోనని వ్యాఖ్యానించారు. అమెరికా రాయబారి మల్‌ఫోర్డు తనను కలిసినట్లు జరిగిన ప్రచారం వాస్తవం కాదని, మల్ ఫోర్డు పదవి నుంచి వైదొలగే చాలాకాలం అయిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ లోని కాన్సులేట్‌ మర్యాదపూర్వకంగా తనను కలిసేందుకు సమయం అడిగారని, మంగళవారం సాయంత్రం ఆయన కలవనున్నారని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+