కేంద్రంలో అంతా అనిశ్సితి

అన్నాడియంకె నేత జయలలిత ఎటూ తేల్చకుండా బేరసారాలకు అవకాశం కల్పిస్తున్నారు. జయలలితను తన వైపు రాబట్టేందుకు కాంగ్రెసు చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇంకా ఇవ్వలేదు. కాంగ్రెసు నాయకుడు గులాం నబీ ఆజాద్ శుక్రవారం రాత్రి జయలలితతో మాట్లాడారు. అయితే ఆమె ఆచరణ సాధ్యం కాని షరతులు పెట్టినట్లు సమాచారం. దీంతో దిక్కు తోచని స్థితిలో కాంగ్రెసు నాయకత్వం పడింది.
తృతీయ కూటమి పరిస్థితి మరీ అయోమయంగా ఉంది. ఆ కూటమిలో ఏ పార్టీలు ఉంటాయో, ఏ పార్టీలు ఉన్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇందులో ఉన్నామని చెబుతున్న దేవెగౌడ వంటి నాయకులు అటో ఇటో ఫిరాయించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications