చిరంజీవి లేకుంటే జీవితమే లేదు
నెల్లూరు : యానాది కులానికి చెందిన తనను వివిధ వేదికల మీద కూర్చొపెట్టి మాట ప్రకారం చట్టసభల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన చిరంజీవి లేకుంటే తన జీవితమే లేదని, ఆయన తమ కుటుంబానికి దేవుడని ప్రజారాజ్యం పార్టీ నాయకురాలు తుపాకుల మునెమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.
నెల్లూరులోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడుతూ యానాది కుటుంబానికి చెందిన తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి చిరంజీవి అన్నారు. ఎన్నికల్లో సామాజిక న్యాయం కోసం తనను ఉపయోగించుకుని ప్రస్తుతం పక్కన పెట్టేశారని ఒక టీవీ ఛానల్లో వచ్చిన వార్తా కథనాన్ని ఆమెఖండించారు. కష్టం చేసుకుని బతికే తాను ఇప్పటికీ అలా ఉండటానికే ఇష్టపడతానని చెప్పారు.
నా కోసం చిరంజీవి అన్నయ్య ఎన్నో చేశారు. అట్టడుగునున్న నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా కోవూరు సీటిచ్చి నిలబెట్టారు. నా విజయం కోసం ఆయన కుటుంబం చిత్తశుద్ధితో కృషి చేయకుంటే 23 వేల ఓట్లు ఎలా వస్తాయి. అన్నయ్య నన్ను పట్టించుకోవడం లేదని జరుగుతున్న ప్రచారం కన్నీళ్లు తెప్పిస్తోందని ప్రజారాజ్యం పార్టీ నాయకురాలు తుపాకుల మునెమ్మ ఆవేదన వ్యక్తంచేశారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications