హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ ది రెచ్చగొట్టే ధోరణి: దేవేందర్

By Staff
|
Google Oneindia TeluguNews

Devender Goud
హైదరాబాద్‌: తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శాసనసభలో మాట్లాడిన తీరు, వ్యవహరించిన తీరు ఆశ్చర్యం కలిగించేదిగా ఉందని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు టి.దేవేందర్ గౌడ్ అన్నారు. అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రి అనే పద్ధతిలో రాజశేఖర రెడ్డి వ్యవహారశైలి, ప్రకటన తీరు లేవని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా రాజశేఖర రెడ్డి వ్యవహరించారని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలో వాతావరణాన్ని కూడా రాజశేఖర రెడ్డి చెడగొట్టారని ఆయన అన్నారు.

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని మంత్రులకు సూచిస్తుంటే రాజశేఖర రెడ్డి మారారని, ముఖ్యమంత్రి వ్యవహార శైలి అదే రీతిలో ఉంటుందని అనుకున్నామని, కానీ రాజశేఖర రెడ్డి అలా లేరని ఆయన అన్నారు. పైగా తెలంగాణపై రాజశేఖర రెడ్డి అసందర్భంగా కూడా మాట్లాడారని, అందుకు సందర్భం కూడా లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నోరు పారేసుకునే పద్ధతిలో మాట్లాడారని ఆయన అన్నారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి వ్యవహరించే తీరు అది కాదని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, ఆ పార్టీ ఎలా మాట్లాడుతుందో, ఎలా వ్యవహరిస్తుందో ప్రజలకు తెలుసునని, కెసిఆర్ బాధ్యతారహితంగా నోరు పారేసుకోవడం అందరికీ తెలిసిందేనని, అయితే బాధ్యతాయుతమై ముఖ్యమంత్రి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. అలా వ్యవహరించడం వల్ల ఏదో సాధిద్దామని రాజశేఖర రెడ్డి అనుకుంటూ ఉండవచ్చు గానీ ప్రజలు అసహ్యించుకుంటారని ఆయన అన్నారు. అందుకు రాజశేఖర రెడ్డి శాససనభను వేదిక చేసుకోవడం కూడా బాగా లేదని ఆయన అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఏమీ చెప్పకపోగా అనవసరమైన వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X