ఉనికి కోసమే వ్యతిరేకత: వైయస్

"చిన్న, సన్న, మోతుబరి రైతులన్న వ్యత్యాసానికి తావులేకుండా నాగలి పట్టిన ప్రతి ఇంటా ఎనలేని ఆనందం, సౌభాగ్యం నింపడమే నా ధ్యేయం. రైతు కోసం ఒకటికి పదిసార్లు ఆలోచించి, నిపుణులతో చర్చించి క్షుణ్నంగా పరిశీలించి సహకార సేద్యం దిశగా అడుగులేశాం. ప్రతి పల్లెకు కనిష్ఠంగా రూ.100 కోట్లు వెచ్చించి ప్రతి చేనుకు నీరు, ప్రతి చేయికీ పని కల్పించడం సహకార సేద్యం ద్వారా జరిగే ఉపకారం. ప్రారంభంలో ఒక్కో జిల్లాలో రెండు గ్రామాల చొప్పున 50 గ్రామాల్లో దాదాపు రూ.5 వేల కోట్ల పెట్టుబడి పెట్టి సహకార సేద్యంతో ఆయా గ్రామాల్లో రెండో హరిత విప్లవానికి నాంది పలుకుతామని" వైఎస్ తన లేఖలో వివరించారు. ఎకరా, అర ఎకరా భూమి ఉన్న వారి ఇబ్బందులన్నీ సహకార సేద్యంతో పరిష్కారమవుతాయని, ఐదేళ్లలో ఏ సంవత్సరం అధిక ఆదాయం వచ్చిందో దాన్ని పరిగణనలోకి తీసుకుని ఏటా రైతుకు ఆ మొత్తం వచ్చేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు.
ఒకవేళ సహకార సంఘం నుంచి బయటకు రావాలనుకుంటే ఎలాంటి ఇబ్బందీ లేకుండా పూర్వస్థితికి తీసుకొచ్చే బాధ్యతా సర్కారుదేనని స్పష్టం చేశారు. కుప్పంలో నిర్వహించిన కార్పొరేట్ సేద్యానికి, సహకార సేద్యానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. రైతు బాగుపడితేనే తన ప్రజా జీవితానికి సార్థకతని, సహకార సేద్యంలో రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా చూడాలని, చేయిచేయి కలపాలని కోరారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications