దొంగల బీభత్సం: భార్య మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో సోమవారం దోపిడీ దొంగలు బీభత్సం సృష్టింటారు. జిల్లాలోని కందుకూరు మండలం సరస్వతిగూడలో దోపిడీ దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించి ఇంటిలోని దంపతులపై దాడి చేశారు. ఈ దాడిలో భార్య మృతి చెందింది. భర్త తీవ్ర గాయాలపాలై హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
దోపిడీ దొంగలు దంపతులపై దాడి చేసి నగదు, బంగారు నగలు దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా అయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications