నన్ను రెచ్చగొట్టవద్దు: వైయస్

రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన మాట వాస్తవమేనని, అది ఎప్పుడూ జరిగేదే అని ఆయన అన్నారు. ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఉన్న ధరలు ఇప్పుడున్నాయా అని ఆయన అడిగారు. సరుకుల హోల్ సేల్ ధరలు చూస్తే ఇతర రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలోనే ధరలు తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. ధరల విషయంలో కేంద్రం ఏమీ చేయలేదని, ఆ విషయం రాష్ట్రాలే చూసుకోవాలని ఆయన అన్నారు. కొత్త పంట వస్తే ధరలు తగ్గుతాయని ఆయన అన్నారు. దానికి తెలుగుదేశం సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరలు విపరీతంగా ఉండేవని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించామని ఆయన అన్నారు.
రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు అదుపులోనే ఉన్నాయని మంత్రి గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. అక్రమ నిల్వల వల్లనే కందిపప్పు ధర పెరిగిందని ఆమె చెప్పారు. నాలుగు శాతం వ్యాట్ వల్ల ధరలు పెరగలేదని ఆమె స్పష్టం చేశారు. వ్యాట్ అమలులో లేని రాష్ట్రాల్లో కూడా పప్పు దినుసుల ధరలు పెరిగాయని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications