మమ్మల్ని భయపెడుతున్నారు: సిఎం

గుర్తింపు లేని పార్టీకి కూడా తమకు కేటాయించినంత సమయం ఇస్తున్నారని ఆయన లోకసత్తానుద్దేశించి అన్నారు. శాసనసభ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అలా ఉండాలంటే ప్రతిపక్షాలకు శాసనసభలో తగిన సమయం ఇవ్వాలని ఆయన అన్నారు. మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆయన అన్నారు. మిగతా ప్రతిపక్షాలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి శాసనసభలో గంటల తరబడి మాట్లాడుతున్నారని, తమపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే స్పీకర్ వాటిని అనుమతిస్తున్నారని, నిరసన తెలిపి తమను కూర్చోవాలని చెబుతున్నారని ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి కె. రోశయ్య తమను బూతులు తిట్టారని, అయినా స్పీకర్ పట్టించుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications