చిరంజీవితో ఎర్రంనాయుడు భేటీ

రెండు రాష్ట్రాల మధ్య గల జలవివాదంపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. ఈ ఘటనపై మొయిలీని కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటక ఎగువన నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు అక్రమం ఎలా అవుతాయని వీరప్ప మొయిలీ ఆదివారం ప్రశ్నించారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కర్ణాటకకు చెందిన మొయిలీ వ్యాఖ్య పక్షపాతంతో కూడిందని అభిప్రాయపడుతున్నాయి.












Click it and Unblock the Notifications