బాబుకు పాఠాలు నేర్పుతా: సిఎం

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని, తన వద్దకు వస్తే చంద్రబాబుకు పాఠాలు నేర్పుతానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పనికి రారని, చంద్రబాబుకు శిక్షణ అవసరమని ఆయన అన్నారు. తమకు సభలో మాట్లాడేందుకు అవకాశం సరిగా ఇవ్వడం లేదని చంద్రబాబు చేసిన విమర్శకు శాసనసభలో ఆయన ప్రతిస్పందిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. వైయస్ చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ సమయంలో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

తమకు తగినంత సమయం కేటాయించడం లేదని, సభలో సభ్యుల సంఖ్యను బట్టి పార్టీలకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఈ సమయంలో ఆయన సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వాగ్వివాదానికి దిగారు. ముఖ్యమంత్రికి మాత్రమే సమయం ఇస్తున్నారని ఆయన అన్నారు. విషయ ప్రాధాన్యం కూడా చూడటం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+