వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాది కాల్పులు: ఒకరి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Ludhiana
లూథియానా: ఉగ్రవాదిగా అనుమానిస్తున్న వ్యక్తి జరిపిన కాల్పుల్లో లూథియానా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వెండర్ మరణించగా, ఇద్దరు జిఆర్పీ హెడ్ కానిస్టేబుల్స్ గాయపడ్డారు. అతని లగేజీని పోలీసులు తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఈ సంఘటన జరిగింది. జమ్మూకు చెందిన జేలం ఎక్స్ ప్రెస్ లో వచ్చిన వ్యక్తి లగేజీని నార్కోటిక్ సెల్ రైల్వే పోలీసులు తనిఖీ చేయడానికి ప్రయత్నించారు. పూణే నుంచి ఆ రైలు మంగళవారం తెల్లవారు జామున మూడున్నర గంటలకు లూథియానాకు వచ్చింది.

ఉగ్రవాదిగా అనుమానిస్తున్న బల్బీర్ సింగ్ భూట్నా పోలీసులు లగేజీని తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తుండగా వెంటనే రైలు దిగి కంపార్ట్ మెంటే చాటు నుంచి పోలీసులపైకి కాల్పులు జరిపాడు.ఎదురుకాల్పుల తర్వాత పోలీసులు భూట్నాను అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు ప్రయాణిస్తున్న ఒక మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన హెడ్ కానిస్టేబుళ్లను కరణ్ పాల్ సింగ్, నరంజన్ సింగ్ లుగా గుర్తించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X