కెసిఆర్ ది బురద రాజకీయం: శ్రీధర్

రాయలసీమ ప్రాజెక్టులను అక్రమమని అంటున్న కెసిఆర్ తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులను కూడా అక్రమమని అనగలరా అని ఆయన అడిగారు. జల విద్యుదుత్పత్తికి శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేశారనే విషయం తెలిసినా కెసిఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో 17 లక్షల కరెంట్ మోటార్లున్నాయని, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి జరగకపోతే వాటికి విద్యుత్తును అందించడం కష్టమని తెలుసునని, అయినా కెసిఆర్ తప్పుడు విమర్శలు చేశారని ఆయన అన్నారు. వరదలను కూడా రాజకీయం చేయడం కెసిఆర్ కు మంచిది కాదని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడు వల్లనే వరదలు వచ్చాయని కెసిఆర్ విమర్శించడం బురద రాజకీయమని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications