హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు మొయిలీ హితవు

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
హైదరాబాద్: అనవసర రాజకీయాలు మానుకుని వరద సహాయక చర్యల్లో ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి హితవు పలికారు. రాష్ట్రంలోని వరద బాధితులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన చెప్పారు. వరద సహాయక చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చంద్రబాబు చేసిన విమర్శను ఆయన తప్పు పట్టారు. చంద్రబాబు విమర్శల్లో నిజం లేదని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆందించే వేయి కోట్ల రూపాయలు తొలి విడత సహాయం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రోశయ్య నాయకత్వంలోని ప్రభుత్వం వరద సహాయక చర్యల్లో సమర్థంగా వ్యవహరిస్తోందని ఆయన ప్రశంసించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు, అందించిన సాయం ప్రజలందరికీ తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు అనవసరమైన విమర్శలు చేయడం తగదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X