వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో రెండు పేలుళ్లు: 18 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Blast
పెషావర్: పాకిస్థాన్ పేలుళ్లతో అట్టుడికిపోతోంది. శుక్రవారంనాడు మరో రెండు పేలుళ్లు సంభవించి మరో 18 మంది మరణించారు. డజను మందికి పైగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం సంభవించిన పేలుడులో 7గురు మరణించిన విషయం తెలిసిందే. శుక్రవారంనాడు పాకిస్తాన్ లో మూడు పేలుళ్లు సంభవించి మొత్తం 25 మంది మరణించారు. పెషావర్ లో పెళ్లి బృందం వెళ్తున్న బస్సును ఉగ్రవాదులు పేల్చివేశారు. దీంతో 18 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నారు.

పెషావర్ లోని రెస్టారెంట్ వెలుపల మరో బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో పది మంది దాకా గాయపడ్డారు. హయతాబాద్ లో ఒక వ్యక్తి కారులో వచ్చాడని, అతను దిగగానే రెస్టారెంట్ వెలుపల ఆ కారు పేలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారు పేలగానే పొడవైన జుట్టు ఉన్న వ్యక్తి పారిపోయాడని వారన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఒక వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X