హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కీడా, మేలా జగన్ ఆలోచించుకోవాలి: విహెచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ రాజీనామా వ్యవహారం తనకు మేలు చేస్తుందా, కీడా చేస్తుందా అనే విషయాన్ని దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్ ఆలోచించుకోవాలని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. కొండా సురేఖ రాజీనామాపై తాను మాట్లాడబోనని అంటూనే ఆయన వ్యాఖ్య చేశారు. ఆయన శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కె.రోశయ్యతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెసులో వైయస్ రాజశేఖర రెడ్డి తర్వాత అంతటి నేత జగన్ మాత్రమేనని అనడం సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో రోశయ్య అంతటి సమర్థ నాయకుడు మరొకరు లేరని ఆయన అన్నారు.

కొండా సురేఖ రాజీనామా విషయం ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారమని ఆయన అన్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చూసుకుంటారని ఆయన అన్నారు. వారి గురించి ఏమీ మాట్లాడుకుండానే చంపేస్తామంటున్నారని, ఏమైనా మాట్లాడితే వెనక నుంచి పొడుస్తారని, తాను వారి గురించి మాట్లాడదలుచుకోలేదు పొడిపించుకోదలుచుకోలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X