ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డికి బెయిల్ నిరాకరణ

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ అధికారిణి రాజేశ్వరి మరణ వాంగ్మూలంలో ముగ్గురు ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ళ కారణంగానే ఆత్మహత్యా యత్నం చేసినట్లు స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ళను తట్టుకోలేకపోయిన తాను ఇక తన తనువును చాలించాలనే శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నానని రాజేశ్వరి మరణవాంగ్మూలంలో స్పష్టం చేసింది. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో రాజేశ్వరి నుంచి మరణ వాంగ్మూలాన్ని పోలీసు అధికారులు తీసుకున్నారు. రాజేశ్వరి మరణించిన నాలుగు రోజుల తరువాత ఆమె మరణ వాంగ్మూలం వెలుగు చూసింది.
దేవరకద్ర మండలంలో మంజూరైన స్ప్రింక్లర్లను తాము చెప్పిన వారికే ఇవ్వాలంటూ ఈ ప్రజాప్రతినిధులు తనపై తీవ్రం ఒత్తిడి తీసుకువచ్చి, మానసిక వేదనకు గురిచేశారని మరణవాంగ్మూలంలో రాజేశ్వరి స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తే అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని, అలా చేయకపోతే వారి నుంచి ఇబ్బందులు తప్పవన్న భయంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు రాజేశ్వరి వెల్లడించింది. తన మనుషులకు రెండు స్ప్రింక్లర్లు ఇవ్వాలని జడ్ పిటిసి ప్రదీప్ గౌడ్ ఒత్తిడి చేశారని, ఎమ్మెల్యే సీతా దయాకరరెడ్డి, ఎంపిటిసి సభ్యురాలు భారతీరెడ్డి కూడా తాము చెప్పిన వారికే స్ప్రింక్లర్లు ఇవ్వాలంటూ వేధించారని రాజేశ్వరి పేర్కొంది.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications