గ్రేటర్ హైదరాబాద్ కలకలంపై సర్వే డిమాండ్

గ్రేటర్ టిక్కెట్లను రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అమ్ముకున్నారని మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వీహెచ్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వాళ్లకు టిక్కెట్లు ఇప్పించారన్నారు. ఇప్పటివరకూ ఆయన అంబర్పేటలో కాంగ్రస్వాళ్లను గెలవనీయలేదన్నారు.
2009 ఎన్నికల్లో అంబర్పేట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఫరీదుద్దీన్ తొలి నుంచీ దివంగత సీఎం వైఎస్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన తన వర్గీయుల్లో కొందరికైనా టికెట్లు ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే హనుమంతరావు ఇక్కడ అన్ని డివిజన్లలోనూ తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టి పంతం నెగ్గించుకున్నారు.












Click it and Unblock the Notifications