గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం చిరంజీవి కసరత్తు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను పీఆర్పీ శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. 51 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధరరావు ప్రకటించారు. పీఆర్పీకి పట్టున్న డివిజన్లలో సర్వే చేసి అభ్యర్థుల జాబితాను తయారుచేసినట్లు ఆయన తెలిపారు. కాగా కాంగ్రెస్లో ప్రజారాజ్యం పార్టీ విలీనమవుతుందని వస్తున్న వార్తలు అవాస్తమని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ తో పొత్తు కోసం చివరిదాకా వేచిచూసి, తీరా విఫలమయ్యాక ఇప్పుడు ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందేమోనని కొందరు నాయకులు సందేహించారు. ప్రస్తుతం పొత్తు లేకున్నావచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అవగాహన కుదిరే అవకాశమే అధికంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోటీలో ఉండటం ఎందుకనే భావనను ఎక్కువ మంది వ్యక్తీకరించినట్లు సమాచారం.