ఓబుళాపురం గనులపై టిడిపి మరో పోరాటం

నిబంధనలను ఉల్లంఘించి ఖనిజాలను రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసి) అక్రమాలపై ప్రభుత్వంలోని ఒక వర్గం కళ్లుమూసుకుని వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓబుళాపురం గనుల్లో అక్రమ తవ్వకాలపై రీ సర్వే చేయించాలని గతంలో సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా ఫలితం లేకపోవడం గమనార్హం. అక్రమ తవ్వకాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఇప్పటిదాకా దాదాపు రెండువేల కోట్లకు పైగా విలువైన ఖనిజాన్ని ఓఎంసీ అక్రమంగా తవ్వితీసినట్లు ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications