వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పర్వతనేని ఉపేంద్ర కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

P Upendra
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర సోమవారం సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల స్టార్ ఆస్పత్రిలో మూత్ర పిండాల వ్యాధికి చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు ఆయన స్వయానా మామ.

ఉపేంద్ర 1936 యగడో 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పోతునూరు గ్రామంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎ చేసిన ఆయన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పట్టా పొందారు. ది మెయిల్ పత్రికలో కొంత కాలం జర్నలిస్టుగా పని చేశారు. 1957లో మూడో తరగతి ఉద్యోగిగా రైల్వేలో చేరారు. రైల్వే ఉద్యోగం నుంచి తప్పుకుని ఆయన 1982లో స్వర్గీయ ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీలో చేరారు. కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు. ఏడాది క్రితం చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు.

ఉపేంద్ర మృతికి ముఖ్యమంత్రి కె.రోశయ్యతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. తాను పెద్ద దిక్కు కోల్పోయానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X