హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సచివాలయ ముట్టడి: బస్సులకు బ్రేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

APSRTC
హైదరాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్జూర్ యూనియర్ (ఎన్ఎంయు) సచివాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసి బస్సులు నిలిచిపోయాయి. దాదాపు 80 శాతం బస్సులు నడవడం లేదు. రాష్ట్రంలోని 21 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. మారు మూల ప్రాంతాలకు బస్సులను నిలిపేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో 50 శాతానికి పైగా బస్సులు ఆగిపోయాయి. సచివాలయ ముట్టడికి ఆర్టీసి కార్మికులు ఇందిరా పార్కు వేలాదిగా చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.

ఆర్టీసి కార్మికుల సచివాలయ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో సచివాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు సమాయత్తమై ఉన్నారు. వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. సచివాలయం చుట్టూ 2 కిలోమీటర్ల మేర నిషేధాజ్ఞలు విధించారు. కార్మికుల ఆందోళనకరంగా బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X