ఆమరణ దీక్షతో కెసిఆర్ బెదిరింపు: సర్వే

తెలంగాణ అంశం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద ఉందని, సోనియా దానిపై నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. అటువంటి స్థితిలో కెసిఆర్ సోనియాను కలవవచ్చునని ఆయన అన్నారు. సోనియా అపాయింట్ మెంటు కెసిఆర్ కు లభిస్తుందని, సోనియా అందరినీ కలుస్తున్నారని, నాయకుడైన కెసిఆర్ కు సోనియా అపాయింట్ మెంట్ లభించకపోవడం ఉండదని ఆయన అన్నారు తాను సోనియా అపాయింట్ మెంటు ఇప్పిస్తానని ఆయన అన్నారు.
కెసిఆర్ సోనియాను కలవాలనుకుంటే ముఖ్యమంత్రి కె.రోశయ్య చొరవ చూపుతారని, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఉన్నారని, కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులం ఉన్నామని, సోనియా గాంధీని కలవాలనుకుంటే తామంతా చొరవ చూపుతామని ఆయన అన్నారు. ఆమరణ దీక్షకు కెసిఆర్ ఆరోగ్యం సహకరించదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications